HomeMovie Newsవారిసు ఫస్ట్ సింగిల్ కోసం తన పాటను తానే కాపీ కొట్టాడని థమన్ ను ట్రోల్...

వారిసు ఫస్ట్ సింగిల్ కోసం తన పాటను తానే కాపీ కొట్టాడని థమన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). ఆన్లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లను షేక్ చేస్తూ తాజాగా విడుదలైన ఈ సినిమాలోని మొదటి పాట రంజితమే ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

థమన్ పాటలను కాపీ కొడతారని మరియు ఒకే తరహాలో ఆయన పాటలు ఉంటాయని తరచుగా విమర్శలు ఎదుర్కొంటారు. కానీ కొన్ని సార్లు ఈ ట్రోల్‌లు మరీ మితిమీరిన స్థాయిలో ఉంటాయి. కాగా కేవలం కొంత సారూప్యత ఉన్న దానిని కూడా కాపీ చేయబడిందని అతి చేస్తారు. ప్రతి సంగీత దర్శకుడికి ఒక నిర్దిష్ట శైలి ఉంటుంది.

కాబట్టి అయిన దానికి కాని దానికి ట్రోల్‌ చేయడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. పాటల్లో శైలిని పునరావృతం చేయడం విసుగు తెప్పిస్తుంది అనే మాట నిజమే కావచ్చు. కానీ ప్రతిసారీ థమన్ ను కాపీ అని ఎగతాళి చేయడం ఏమంత మంచిది కాదు.

వారిసు ఫ‌స్ట్ సింగిల్‌కి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. నెటిజన్లు రంజితమే పాటను తెలుగు సినిమా విన్నర్‌లోని నా బీసీ సెంటర్ లు పాటతో పోలుస్తున్నారు. రెండు పాటలకు బీట్‌లు ఒకేలా ఉండటం నిజమే, కానీ రెండు పాటలకు కూడా థమన్ ఏ సంగీతం అందించారు కాబట్టి ఈ పాటన కాపీ అని పిలవడంలో అర్థం లేదు.

See also  మహర్షి సినిమాకు దగ్గరగా ఉన్న వరిసు వర్కింగ్ స్టిల్స్

పైన చెప్పినట్లుగా, రంజితమే ఇప్పటికే ఆడియో ప్లాట్‌ఫారమ్‌లలో టాప్‌ ట్రెండింగ్ తో సూపర్ హిట్ సాంగ్‌గా మారింది. ఇప్పుడు వారిసు రెండవ సింగిల్ కోసం ఒక బ్లాక్‌బస్టర్ వార్త గురించి ఊహాగానాలు వస్తున్నాయి.

వారిసు సెకండ్ సింగిల్‌ని అనిరుధ్ రవిచంద‌ర్ చేత పాడించ‌నున్నారట. అనిరుధ్ మరియు విజయ్ కాంబినేషన్‌లో పెద్ద హిట్ సినిమాలు మరియు ఆల్బమ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా మాస్టర్ కోసం అనిరుధ్ ఇచ్చిన స్టైలిష్ సౌండ్‌ట్రాక్‌కు ప్రేక్షకుల నుండి ఇప్పటికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతే కాకుండా, ఇటీవల వచ్చిన బీస్ట్‌లోని హలమతి హబీబో పాట ఒక సంచలనం అనేది తెలిసిందే. ఆ పాటకు అనిరుధ్ స్వరకర్తతో పాటు గాయకుడు కూడా అవడం విశేషం.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారిసు చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్, థమన్ ల కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు, శిరీష్‌ల సహకారంతో వంశీ, హరి, ఆశిషోర్ సోలమన్‌లు ఈ చిత్ర కథను రాసారు. వారిసు చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు. మరియు ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత మరియు సంయుక్తతో సహా సమిష్టి తారాగణం ఈ చిత్రంలో కనిపించబోతుంది.

See also  బిల్లా స్పెషల్ షోలలో అపశృతి.. అత్యుత్సాహంతో థియేటర్ తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories